|
|
|
శ్రీ
శివప్రసాద్ చిన్నతనంలో ఇంట్లో మ్రోగే గ్రామ్ ఫోన్ రికార్డుల ద్వారా
సంగీత నాదం అతని హృదయంలో హత్తుకుపోయింది.అవ లీలగా అనుకోకూండా అతను
ఈలపాట పాడుతూ తెలియని రాగాలు ఆలపిస్తూ ఉండేవారు. అప్పట్లో ఆ ఈలపాటలను
ఎన్ని గంటలైనా అలా పాడుతూనే ఉండేవారు. తన స్వగ్రామం బాపట్లలో ఉన్న
స్నేహితులు, పెద్దలు తనపా టలు వింటూ ఉండేవారు. శివప్రసాద్ వారు కోరిన
పాటలను ఈలపాటతో పాడి వారందరిని సంతోషపరిచేవారు. అలా పాడుతూ గుర్తింపు
తెచ్చుకుని చిన్న చిన్న కచేరీలు ఇవ్వడం ప్రారంభించారు.
తరువాత కర్ణాటక, హిందుస్థానీ, శాస్త్రీయ సంగీతాలలో మంచి ప్రావీణ్యాన్ని
సంపాదించిన తర్వాత ఇప్పుడు గంటల తరబడి ఈలపాట కచ్చేరీలు చేయడంలో
నిష్ణాతులయ్యారు.
ఇప్పటి వరకు శ్రీ కొమరవోలు శివప్రసాద్ 11000 కి పైగా సంగీత కచేరీలు
చేశారు.
ఒక్క భారత దేశంలోనే కాక అమెరికా, జపాన్, ఆస్టేలియా, బ్రిటన్, మారిషస్,
సింగపూర్, మలేషియా,బ్యాంకాక్, దుబాయ్, బెహరిన్, కతార్ మొదలైన దేశాల్లో
తన ఈల పాటతో సంగీత కచేరీలు చేస్తూ సంగీతాభిమానులకు ఆనందంతో పాటు
ఆశ్చర్యాన్నీ కలిగిస్తున్నారు.
|